BDK: అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి మణుగూరు నుంచి మొరంపల్లి బంజరకు వెళ్తున్న పశువుల వ్యాన్ను అడ్డగించి, అక్రమంగా రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున అశ్వాపురం టీడీపీ సెంటర్ వద్ద మణుగూరు నుంచి మొరంపల్లి బంజరకు వాహనమునందు బంధించి తరలిస్తున్న 12 పశువులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.