కర్ణాటక బళ్లారిలోని ఓ స్కూల్ హాస్టల్లో దారుణం జరిగింది. తోటి విద్యార్థి హేమంత్ను భరత్ కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన ఆరుగురు 9వ తరగతి విద్యార్థులకు గాయాలయ్యాయి. అయితే హేమంత్ది కర్నూలు జిల్లా సమ్మతగేరి స్వగ్రామం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.