అహ్మదాబాద్ వేదికగా రేపు భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య సూపర్-8 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించేలా ఉండటంతో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్లతో భారత్ బరిలోకి దిగనుంది. అలాగే, ఓపెనర్ అభిషేక్ శర్మపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో సంజూ శాంసన్ను ఆడించే వీలుంది.