MNCL: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నలిమెల రాజు, ఎంపీవో శ్రీనివాస్, వార్డు సభ్యులు ఉన్నారు.