KRNL: హెబ్బటం గ్రామంలో భక్తి ఉద్యమకారుడు, సామాజిక సంస్కర్త శ్రీ కనకదాసు విగ్రహావిష్కరణ మహోత్సవం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆలూరు TDP ఇంఛార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కనకదాసు భక్తి, సమానత్వం, సామాజిక సందేశాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.