బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కొమిల్లా ప్రాంతంలో శనివారం పూజ చేసుకుంటున్న హిందువుల బృందంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం. పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.