అన్నమయ్య: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లిలో మహిళా వాకథాన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మిషన్ కాంపౌండ్ వద్ద ర్యాలీని ప్రారంభించి మహిళలతో కలిసి నడిచారు. అనంతరం జరిగిన సభలో మహిళా భద్రతకు పోలీసులు కట్టుబడి ఉన్నారని తెలిపారు. వాకథాన్లో చురుగ్గా పాల్గొన్న 10 మంది మహిళలను ఎస్పీ అభినందించి బహుమతులు అందజేశారు.