AKP: పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని అచ్యుతాపురం మండల సీపీఎం కన్వీనర్ ఆర్.రాము డిమాండ్ చేశారు. ఇవాళ అచ్యుతపురంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలపై కేంద్రం మోయలేని భారం మోపిందన్నారు. సిలిండర్కు రూ.60 పెంచడంతో ప్రజలకు ఆర్థికంగా భారం అవుతుందని, ఇరాన్పై యుద్ధం వద్దని అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలన్నారు.