NRPT: గుండుమాల్ మండలం భక్తి మల్ల గ్రామంలో ఎస్ఈ నవీన్ కుమార్ శనివారం ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసి, రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. సర్పంచ్ జ్యోతి శ్రీకాంత్, బానోదయ్, అరుణ్, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.