VSP: మోంథా తుపాను నేపథ్యంలో, తుఫాన్ ప్రత్యేక అధికారి అజయ్ జైన్ ప్రస్తుత పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంగళవారం విశాఖలో మీడియాకు వివరించారు. తుఫాన్ ప్రస్తుతం విశాఖకు 560 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. 80 నుంచి 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు.