NZB: జిల్లా కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వరాలయంలో గురువారం కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకము, హారతి వంటి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు కలెక్టర్ దంపతులను శేషవస్త్రముతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.