JGL: జగిత్యాల ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘు పాల్గొన్నారు.