MNCL: కోటపల్లి మండలంలోని లక్ష్మీపూర్ సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారిపై అక్రమంగా దాబాలు ఏర్పాటు చేసి మద్యం అమ్ముతున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దాబా నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.