BHPL: మొంత తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని MLA గండ్ర సత్యనారాయణ రావు హామీ ఇచ్చారు. టేకుమట్ల మండలం గుమ్మడివెల్లిలో ఇవాళ MLA పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు విన్నారు. సమగ్ర సర్వే చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు. నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.