MBNR: షాద్ నగర్ జాతీయ రహదారిపై గురుకుల విద్యార్థినులు ఈరోజు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ప్రిన్సిపల్ శైలజ వేధింపులకు గురిచేస్తున్నారని, తమ నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ విద్యార్థినులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేసి, షాద్నగర్ PSకు తరలించారు.