AP: కాశీబుగ్గ దేవాలయంలో నిన్న తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. ప్రైవేటు ఆలయమైన దానిపై ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందన్నారు. ఆలయాన్ని నిర్మించిన హరిముకుంద్ పాండా సంకల్పం మంచిదే అయినా.. నిర్మాణం విషయంలో నిపుణుల సలహా తీసుకుని ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. కాగా, తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించగా.. 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.