ADB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బోథ్ MLA అనిల్ జాదవ్ రహమత్ నగర్ డివిజన్లోని కార్మిక నగర్ కాలనీలో సోమవారం పర్యటించారు. ఇంటింటి ప్రచారం చేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. హామీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.