ATP: తాడిపత్రి మండలం గంగాదేవిపల్లిలో ఆదివారం శ్రీ గంగమ్మతల్లి అమ్మవారు భక్తులకు విశేష దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారిని రంగురంగుల పుష్పాలు, విశిష్ట ఆభరణాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. ఈ వేడుకను చూడటానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.