SKLM: రణస్థలం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చీపురు పట్టి మండల పరిషత్ కార్యాలయ ప్రాంతాల్లో శుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.