PDPL: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను సన్మానించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూ. 40 లక్షలతో 26 మంది వికలాంగులకు స్కూటీలు పంపిణీ చేశారు.