BHNG: అన్ని రంగాల్లో మహిళలను విస్మరిస్తున్నారని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాంకేతికత పెరుగుతున్నా మహిళలను రెండో తరగతి పౌరులుగానే చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు మహిళా సాధికారత అని ప్రగల్భాలు పలికే పార్టీలు, అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాయన్నారు.