KMM: కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా కనెక్షన్ అందించడమే తమ లక్ష్యమని కౌన్సిలర్ పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా వార్డు ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు 1వ వార్డు కౌన్సిలర్ మోరు శ్రీకాంత్ తెలిపారు. శనివారం ఆయన వాటర్ గ్రిడ్ AE, DEలతో కలిసి వార్డు పరిధిలో పర్యటించారు.