ELR: ఎపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి శనివారం ఏలూరు జిల్లా భీమడోలు పర్యటించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా భీమడోలు ప్రధాన సెంటర్లో ఆమె రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.