సైబర్ మోసాలకు గురైనవారికి RBI ఊరటనిచ్చే కబురు చెప్పింది. రూ.50,000లోపు మోసాలకు బాధితులకు గరిష్ఠంగా రూ.25,000 పరిహారం అందించాలని నిర్ణయించింది. ఇందులో RBI 65%, కస్టమర్-బెనిఫిషియరీ బ్యాంకులు చెరో 10% భరిస్తాయి. మోసపోయినవారు 5 రోజుల్లోపు 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలి. దీంతో కొంతైనా పరిహారం లభిస్తుంది. కాగా రూ.50 వేల కంటే ఎక్కువ కోల్పోయినవారికి ఇది వర్తించదు.