ఎన్టీఆర్: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవంలో కేశినేని చిన్ని, జానకీ లక్ష్మి దంపతులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు అమ్మవారికి పసుపు కుంకుమ, పండ్లు సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.