PDPL: అంతర్గాం మండలం కుందనపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలను కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని వంటగది, సామాగ్రి, పరిసరాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, అందించాలని సూచించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.