సత్యసాయి: ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు లాభాలు పెరుగుతాయని మంత్రి సవిత తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన వర్క్షాప్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. సహజ వనరులతో వ్యవసాయం చేయడం వల్ల నేల సారం పెరుగుతుందన్నారు.