AP: రాష్ట్ర రాజధాని అమరావతిపై చిన్నజీయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఏర్పడిన అమరావతి రాజధానిని మధ్యలో కొందరు తరలించాలని చూశారన్నారు. అయితే స్వామి కృపతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదని పేర్కొన్నారు. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి అమరావతి రాజధాని పనులను వేగవంతం చేసింది. ఈ క్రమంలో చిన్నజీయర్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధన్యత సంతరించుకున్నాయి.