BDK: అన్నపురెడ్డిపల్లి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు చేపట్టారు. రూ. 5,34,196 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారి రమణ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రూ. 23,000 ఆదాయం పెరిగినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.