ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో శ్రీ మారెమ్మ అమ్మవారిని శుక్రవారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) దర్శించుకున్నారు. అనంతరం ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటినుంచో శ్రీ మారెమ్మ అమ్మవారి దర్శనానికి రావాలని అనుకుంటున్నానని, ఇప్పటికి అమ్మవారి దర్శన భాగ్యం లభించిందన్నారు.