MBNR: నారాయణపేటలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ప్రతినిధులు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ డీకే అరుణను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అరుణ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ మేరకు ప్రజలకు సేవ చేయడంలో తమ వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.