Dil Raju : శాకుంతలం మూవీ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్
తన తాజా చిత్రం శాకుంతలం (Sakunthalam) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సమంత రుత్ ప్రభు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భగవద్గీత శ్లోకం. ఫలితాల గురించి ఆలోచించకుండా కష్టపడి పనిచేయడం అనే అర్థం వచ్చేలా ఆ శ్లోకం ఉంది.
శాకుంతలం (Sakunthalam) డిజాస్టర్ రిజల్ట్ పై ప్రముఖ నిర్మాత దిల్రాజు (Dil Raju) సంచలన కామెంట్స్ చేశారు.”సగటు ఆడియన్స్ ను అన్ని థియేటర్లకు పంపించి రివ్యూస్ (Reviews) తెప్పించేశాం. అప్పటికే మాకు విషయం అర్థమైపోయింది. సోమ, మంగళవారానికి కలెక్షన్లు లేవంటే రిజల్ట్ ఏంటనేది అర్థమైపోవాలి. అప్పటికీ భ్రమల్లోనే ఉంటామంటే నడవదు. నా 25 ఏళ్ల కెరీర్ లోనే అతిపెద్ద జర్క్ ఇచ్చిన సినిమా శాకుంతలం.” అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.క సోమవారం, మంగళవారానికి కలెక్షన్లు లేవంటే రిజల్ట్ ఏంటనేది గ్రహించాలి. అప్పటికీ ఇంకా భ్రమల్లో ఉండకూడదు.
నా 25 ఏళ్ల కెరీర్ లోనే అతిపెద్ద జర్క్ ఇచ్చింది శాకుంతలం.”ఇలా శాకుంతలం సినిమాపై ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేశాడు దిల్ రాజు. గుణశేఖర్ తో కలిసి ఈ సినిమాను నిర్మించారు దిల్ రాజు. దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar), సమంతపై ఉన్న నమ్మకంతో భారీగా పెట్టుబడి పెట్టాడు. తాజా సమాచారం ప్రకారం, పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వచ్చినట్టు లేదు. ఇద్దరు నిర్మాతల్లో ఎవరికి ఎంత నష్టం వచ్చిందనేది వాళ్లకే తెలియాలి. రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షో(First show)తోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది సినిమా. తొలత భారీ అంచనాలతో రిలీజై అంచనాలను తలకిందులు చేస్తూ నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఫెయిల్యూర్ పై నటి సమంత (Samantha) తనదైన శైలిలో స్పందించారు. సినిమాలో నటించడం వరకే తన పని.. అని ఫలితం తన చేతిలో లేదంటూ.. (Bhagavad Gita) శ్లోకాన్ని కోట్ చేసింది.