E.G: రాజమండ్రి నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. శుక్రవారం కోటిలింగాలపేటలోని 10 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఆయన తనిఖీ చేశారు. నీటి శుద్ధి, క్లోరినేషన్ విధానాన్ని పరిశీలించి, ప్రతిరోజూ నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.