VZM: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కూటమి పాలన సాగుతుందని ఎమ్మెల్యే లోకం నాగమాధవి వెల్లడించారు. కొండవెలగాడ-విజయనగరం రహదారి రిసర్ఫేసింగ్ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. రూ.1.75 కోట్లతో ఈ రహదారి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంతోనే పారదర్శక పాలన సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో గదల అచ్చంనాయుడు, యడ్ల గోవిందరావు పాల్గొన్నారు.