AP: ఉత్పత్తులపై ప్రొడెక్ట్ కాలపరిమితి ముద్రించటం తప్పనిసరని మంత్రి సత్యకుమార్ అన్నారు. ప్యాకింగ్ ఫుడ్ను నిర్ధిష్ట నిబంధనలు అనుసరించి భద్రపరచాలని తెలిపారు. చాలాచోట్ల నిబంధనలు పాటించడం లేదన్నారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన దురదృష్టకరమన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. డార్క్ స్టోర్స్ పైనా తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.