ELR: భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఆన్ లైన్ పెట్టుబడులు, లాభాలు అనే రెండు బూటకపు మాటలను తిప్పి కొట్టాలని ఎస్సై మదీనా భాష సూచించారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. క్రిప్టో కరెన్సీ అనే కుంభకోణంలో ఎంతో మంది కుదేలయ్యారన్నారు. అమాయకులే టార్గెట్గా సైబర్ మోసాలు జరుగుతాయని, మోసానికి గురైతే నం.1930 ఫోన్ చేయాలన్నారు. తెలియని లింక్స్ పై క్లిక్ చేయొద్దన్నారు.