E.G: కోరుకొండ మండలం గాదరాడలో శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతర మహోత్సవాలలో భాగంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారికి శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన గరగల నృత్యాలు, కోలాటం, బోనాల ముత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.