SRPT: మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన బూదరపు ఉపేందర్ తన ట్రాక్టర్ ద్వారా ముకుందాపురం శివారులోని పాలేరు వాగు నుంచి అక్రమంగా మద్దిరాలకు ఇసుకను తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ వీరన్న హెచ్చరించారు.