అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని డీపీఆర్సీ భవనంలో శుక్రవారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు జెడ్పీ సీఈవో శివశంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దిశ’ చైర్మన్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో నాలుగో త్రైమాసిక అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించనున్నారు.