పూజ పుణ్యదాయకం. అయితే పూజ ఎప్పుడు ఎలా చేయాలనేది చాలా మందికి అవగాహన ఉండదు. ఈ నేపథ్యంలో సూర్యోదయమైన తొలి 2/3 గంటల్లోనే పూజ ముగించడం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. 8, 8:30 గంటల లోపు అయితే మానసిక ప్రశాంతతతో పాటు దైవంపై ఏకాగ్రత కుదురుతుందట. ఉదయం వేళలో పూజ చేసేవారికి రోజంతా ఉత్సాహం, ఉల్లాసంగా గడుస్తుందని వివరిస్తున్నారు. సూర్యోదయానికి ముందే అయితే ఇంకా ఉత్తమమని సూచిస్తున్నారు.