ADB: పట్టణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కలిసి రావాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాల గడిచిన సందర్భంగా హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కోశాధికారి రవీందర్, నర్సింలు, స్వామి, రాజు, కిషన్, అశోక్ రెడ్డి, సుభాష్ తదితరులు ఉన్నారు.