SDPT: హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మల్లికార్జున్ అధ్యక్షతన వార్డు ఆఫీసర్లతో సమీక్షా సమావేశం జరిగింది. 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు.