BHNG: ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి రైతు భరోసా గుర్తుకొస్తుందని, రైతు భరోసాను ఓట్ల భరోసాగా మార్చి ఓట్లు రాబట్టుకునేందుకే ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోందని డీసీసీబీ మాజీ ఛైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. శుక్రవారం గుండాల మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందన్నారు.