VZM: ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి దివస్ వారోత్సవాల సందర్భంగా పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ కె. సత్యం గురువారం తెలిపారు. సుమారు 30 మంది వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, బీపీ, షుగర్, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి జన ఔషధి కేంద్రం ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేశారు.