మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన దాసరి కృష్ణయ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా.. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి శుక్రవారం కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు తక్షణ సహాయం అందజేశారు. ఆయన ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. ఈ కార్మక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదులు, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.