కృష్ణా: గుడివాడ ఏజీకే స్కూల్ సమీపంలోని అన్న క్యాంటీన్ను కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రత, లబ్ధిదారులకు అందుతున్న సేవలను ఆయన పరిశీలించారు. అన్న క్యాంటీన్లో తక్కువ ధరతో నాణ్యమైన భోజనం అందించడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపాడు.