NLG: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుభరోసా పథకంపై గొప్పలు చెప్పుకుంటున్నవ్పటికీ, ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శించారు. రైతులకు పెట్టుబడులు లేక అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.