MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ గురుభక్తి చాటుకున్నారు. నస్పూర్ పరిధి సీతారాంపల్లిలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో తనకు చదువు నేర్పిన ఉపాధ్యాయుడు జాడి శంకరయ్యకు పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఓనమాలు నేర్పడంతో పాటు చిన్ననాటి నుంచి తన ఎదుగుదలకు ఉపాధ్యాయుడు శంకరయ్య పోషించిన పాత్ర మరువలేనిదని తెలిపారు.