KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ గురువారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సీఎం YS జగన్ ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఆయన బెంగళూరు నుంచి బయలుదేరి ప్రొద్దుటూరుకు వచ్చారు. అయితే, జగన్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. కాగా, మరి కాసేపట్లో ఫంక్షన్ హాల్కు చేరుకుని వధూవరులను ఆశీర్వదించనున్నారు.