AP:YCP హయాంలో తిరుమలలో భగవద్గీత పుస్తకాల పేరుతో భారీ అవినీతి జరిగిందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. TTD చరిత్రలోనే ఇది అతిపెద్ద స్కామ్. 50 గ్రాములు కూడా లేని భగవద్గీత పుస్తకాన్ని YCP హయాంలో ముద్రించారు. భగవద్గీత పుస్తక ముద్రణలో ధర్మారెడ్డి పేరు ఎందుకు? ఈ పుస్తకం పేరుతో రూ.కోట్లు తినేశారు. ఈ బాగోతాన్ని బయటపెట్టినందుకే TTD ఛైర్మన్ను టార్గెట్ చేశారు’ అని అన్నారు.